మండల స్థాయిలో ‘ప్రజావాణి’
ABN , Publish Date - Aug 05 , 2026 | 05:29 AM
ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఇక నుంచి మండల స్థాయిలోనూ నిర్వహించనున్నారు.
సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు
ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఇక నుంచి మండల స్థాయిలోనూ నిర్వహించనున్నారు. ప్రతి సోమవావారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మండల పరిషత్ కార్యాలయాల్లో(ఎంపీడీఓ) ఈ కార్యక్రమాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపింది. 23 శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించాలని, వాటిని ప్రజావాణి పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.