7లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అప్పజెప్పారు: అద్దంకి
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:09 AM
గత బీఆర్ఎస్ సర్కారు రూ.7 లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని అప్పగించిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు..
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్ఎస్ సర్కారు రూ.7 లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని అప్పగించిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. ద్రవ్య ప్రణాళికను అమలు చేయడంలో గత సర్కారు విఫలమైందని అన్నారు. శాసనమండలిలో సోమవారం అద్దంకి మాట్లాడుతూ.. బడ్జెట్పై ప్రతిపక్షం నిర్మాణాత్మక సూచనలు చేస్తుందని ఆశించామన్నారు. కానీ రోజు మాదిరిగానే రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.