రాష్ట్రంలో తొలిసారిగా బాలిక తాత్కాలిక దత్తత
ABN , Publish Date - May 01 , 2026 | 05:23 AM
రాష్ట్రంలో తొలిసారి ఫోస్టర్ కేర్ (తాత్కాలిక దత్తత) ఇచ్చిన జిల్లాగా నిజామాబాద్ నిలిచింది. కుటుంబానికి దూరమైన/నిర్లక్ష్యానికి గురైన/దుర్బలమైన ఆరేళ్లకు పైబడిన బాలబాలికలను ...
మంత్రి సీతక్క సమక్షంలో అప్పగింత
సుభా్షనగర్, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొలిసారి ఫోస్టర్ కేర్ (తాత్కాలిక దత్తత) ఇచ్చిన జిల్లాగా నిజామాబాద్ నిలిచింది. కుటుంబానికి దూరమైన/నిర్లక్ష్యానికి గురైన/దుర్బలమైన ఆరేళ్లకు పైబడిన బాలబాలికలను రెండేళ్ల పాటు దత్తతకు ఇవ్వడం, తదుపరి వారికి నచ్చితేనే ఆ కుటుంబంతో కలిసి ఉండేలా చేయడమే దీని ఉద్దేశం. జిల్లా మహిళ శిశు సంక్షేమశాఖ, జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ల ఆధ్వర్యంలో గురువారం మంత్రి సీతక్క చేతుల మీదుగా ఓ బాలికను ఫోస్టర్ కేర్కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆరేళ్లకు పైబడిన పిల్లలను దత్తత ప్రక్రియలో భాగం చేయాలని, అలాగే దత్తతకు వెళ్లలేని ఇదే వయసు పిల్లలకు కుటుంబ వాతావరణం కల్పించేవిధంగా ఫోస్టర్ కేర్కు ఇవ్వాలని అన్నారు. ఫోస్టర్ కేర్ తీసుకోడానికి కుటుంబాలు ముందుకురావాలని పిలుపునిచ్చారు.