Share News

గవర్నర్‌కు ప్రముఖుల పరామర్శ

ABN , Publish Date - Aug 29 , 2026 | 04:45 AM

తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను లోక్‌భవన్‌లో పలువురు ప్రముఖులు పరామర్శించారు. గవర్నర్‌ గుండెకు వైద్యులు స్టెంట్‌ వేసిన నేపథ్యంలో..

గవర్నర్‌కు ప్రముఖుల పరామర్శ

హైదరాబాద్‌, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను లోక్‌భవన్‌లో పలువురు ప్రముఖులు పరామర్శించారు. గవర్నర్‌ గుండెకు వైద్యులు స్టెంట్‌ వేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌ బాబు, సీఎస్‌ సంజయ్‌ జాజూ గవర్నర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గవర్నర్‌ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.

Updated Date - Aug 29 , 2026 | 04:47 AM