Minister Tummala Nageswara Rao: రైతుల సంక్షేమానికి రూ.లక్ష కోట్లు:
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:48 AM
రాష్ట్రంలో రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.లక్ష కోట్ల నిధులు ఖర్చు చేసిన ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
రాష్ట్రంలో రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.లక్ష కోట్ల నిధులు ఖర్చు చేసిన ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని పేర్కొన్నారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి రైతుల్లో చైతన్యం కలిగించామని చెప్పారు. సీసీఐ నిబంధనలు కొంత ఇబ్బందిగా ఉన్నా.. రైతుల ప్రయోజనాల కోసం ప్రత్యేక అధికారులను నియమించి కొనుగోళ్లు జరిగేలా చూస్తున్నామన్నారు.