విద్యార్థుల హాజరు శాతం పెంచాలి : డీఈవో
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:35 PM
పాఠ శాలలో విద్యార్థుల హజరు శాతం పెంచాలని నాగర్కర్నూల్ జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్ కుమార్ అన్నారు.
కోడేరు, జూన్ 23 (ఆంధ్రజ్యోతి) : పాఠ శాలలో విద్యార్థుల హజరు శాతం పెంచాలని నాగర్కర్నూల్ జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్ కుమార్ అన్నారు. కోడేరు మండల కేంద్రం లోని ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా బోధ నపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యా యులకు సూచించారు. అనంతరం మాట్లాడు తూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచా లన్నారు. బడిబాటలో ఎంత మంది విద్యార్థు లను పాఠశాలలో చేర్పించారని అడిగి తెలు సుకున్నారు. పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ శర్మకు సూచించారు.