రాములోరి కల్యాణంలో నేతల ఆత్మీయ కలయిక
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:57 AM
శ్రీరామ నవమి వేడుకలు వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రాచీన ఖిల్లా రఘునాథ ఆలయంలో....
సుభాష్నగర్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): శ్రీరామ నవమి వేడుకలు వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రాచీన ఖిల్లా రఘునాథ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవం ఈ అరుదైన దృశ్యానికి వేదికైంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దంపతులు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత దంపతులు, బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త ఈ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. నిత్యం పరస్పర విమర్శలు చేసుకునే ఈ నేతలు, స్వామివారి కల్యాణ వేళ ఆత్మీయంగా పలకరించుకోవడం విశేషం. ముఖ్యంగా మహేశ్ కుమార్గౌడ్ సతీమణి సంధ్య, కల్వకుంట్ల కవిత ఒకరి క్షేమ సమాచారాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు. కల్యాణం అనంతరం నేతలు పరస్పరం గౌరవించుకుంటూ మాట్లాడుకోవడం అక్కడికి వచ్చిన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.