Share News

kumaram bheem asifabad- గడువులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి

ABN , Publish Date - Jun 25 , 2026 | 10:34 PM

జిల్లాలో చేపట్టిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంలో అధికారుల కృషి అభినందనీయమని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృ త కలెక్టరేట్‌ భవన సముదాయంలో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో 1.50 కోట్ల లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు జరిగినందున తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సన్నరకం బియ్యంతో తయారు చేసిన ఏడు రకాల పిండి వంటల కిట్లను సంబంధిత అధికారులకు అందజేశారు

kumaram bheem asifabad- గడువులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి
అధికారులకు పిండి వంటకాల కిట్‌ను అందజేస్తున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంలో అధికారుల కృషి అభినందనీయమని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృ త కలెక్టరేట్‌ భవన సముదాయంలో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో 1.50 కోట్ల లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు జరిగినందున తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సన్నరకం బియ్యంతో తయారు చేసిన ఏడు రకాల పిండి వంటల కిట్లను సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈ యాసంగి వరి ధాన్యం, మొక్కజొన్నలు, జొన్నల కొనుగోలు నిర్ణీత గడువులోగా రైతులకు ఇబ్బందులు లేకుండా పూర్తి చేయడంలో అధికారుల కృషి అభినందనీయమని కొనియాడారు. ఇదే స్పూర్తితో భవిష్యత్‌తో కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖాధికారులు పాల్గొన్నారు.

పరిశీలించి.. సూచనలు చేసి..

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు బొంబాయి గూడ, చెడ్వాయి గ్రామాల్లో ఇంటింటికి పంపిణీ చేస్తున్న ఎన్యుమరేషన్‌ ఫారాల ప్రక్రియను గురువారం కలెక్టర్‌ కె హరిత పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ ఓటరుకు ఎన్యుమరేషన్‌ ఫారం అందించిన వెంటనే బీఎల్‌వో యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. బూత్‌ స్థాయి అధికారులకు సూచించారు. ఓటర్లు ఫారాలను పూర్తి చేసిన అనంతరం వాటిని తిరిగి పసేకరించి వివరాలను యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో బూత్‌ స్థాయి ఏజెంట్లు యువజన సంఘాల ప్రతినిధులు, వలంటీర్లు, కుల పెద్దల సహకారం తీసుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహిం చాన్నారు. అనంతరం మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇందిరమ్మ గృహాల నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలను తప్పని సరిగా పాటించాలని సూచిం చారు. గృహ నిర్మాణ శాఖాధికారులు ప్రతి రోజు పనులను పర్యవేక్షించి నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే బొంబాయిగూడ ప్రభుత్వ పాఠశాల ప్రహరీగోడ నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ రవీందర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 10:34 PM