అన్ని హంగులతో నూతన బస్టాండ్
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:36 PM
ప్రజల సౌకర్యార్థం నూతన హంగులతో కొత్త బస్టాండ్ నిర్మా ణం కోసం ప్రణాళిక రూపొందిం చినట్లు నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్రెడ్డి అన్నా రు.
- స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి
కందనూలు, జూలై2 (ఆంధ్రజ్యో తి) : ప్రజల సౌకర్యార్థం నూతన హంగులతో కొత్త బస్టాండ్ నిర్మా ణం కోసం ప్రణాళిక రూపొందిం చినట్లు నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్రెడ్డి అన్నా రు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ని బస్ డిపో సమీపంలోని స్థలాన్ని బస్టాండ్ కోసం గురువారం అధికారులతో ఎ మ్మెల్యే పరిశీలించారు. అన్ని హంగులతో నూ తన బస్టాండ్ ఏర్పాటు కోసం నిధులు మంజూ రు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 8న రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర భాకర్ బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాప నకు వస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్య క్రమంలో ఆర్టీసీ డీఎం యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మునిసిపల్ కౌన్సి లర్ ఎండీ నిజాముద్దీన్, మాజీ కౌన్సిలర్లు జక్క రాజ్కుమార్, కావలి శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు పొడుగు శ్రీనివాసులు ఉన్నారు.