ధాన్యం కొనుగోలు చేయాలి
ABN , Publish Date - May 10 , 2026 | 11:30 PM
రైతులు పండించిన ధాన్యం ప్రభు త్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ మండల నాయకులు వీరా రెడ్డి, కృష్ణగౌడ్లు డిమాండ్ చేశారు.
- బీఆర్ఎస్ మండల నాయకులు
ఊర్కొండ, మే 10 (ఆంధ్రజ్యోతి) : రైతులు పండించిన ధాన్యం ప్రభు త్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ మండల నాయకులు వీరా రెడ్డి, కృష్ణగౌడ్లు డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని స ర్పంచ్ మ్యాకల మంజుల స్వగృ హం లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రం చేపట్టిన తర్వాత రైతులకు ఇబ్బందులు పె డుతున్నారని. వారు పండించిన ధాన్యం కొను గోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్ర భుత్వంపై ఉందని అన్నారు. రైతులు పం డిం చిన ప్రతీ ధాన్యపు గింజ కొనే వరకు బీఆర్ ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే మాజీమంత్రిని విమర్శించడం సమంజసం కాద ని, మరోసారి విమర్శిస్తే గ్రామాల్లో తీరుగనీయ మని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకల మంజుల, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, నాయకులు జంగయ్య, కలీంపాష, వెంకటేష్, రవి తదితరులు ఉన్నారు.