అంబులెన్స్ సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:32 PM
లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిమ ఫాం డేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వెం టిలేటర్ అంబులెన్స్ సేవలను కలెక్టర్ కుమా ర్ దీపక్తో కలిసి ఎమ్మెల్యే కోక్కిరాల ప్రేంసా గర్రావు ప్రారంభించారు.
లక్షెట్టిపేట ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిమ ఫాం డేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వెం టిలేటర్ అంబులెన్స్ సేవలను కలెక్టర్ కుమా ర్ దీపక్తో కలిసి ఎమ్మెల్యే కోక్కిరాల ప్రేంసా గర్రావు ప్రారంభించారు. ఈసందర్బంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ ఆత్యవసర పరి స్థితుల్లో ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులను మెరుగైన వైద్యం అందించే ఆసుపత్రికి సురక్షితంగా తర లించేందుకు ఈ వెంటిలెటర్ అంబులెన్స్ సేవ లు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంద న్నారు. పేద, సామాన్య ప్రజలకు ఆత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసు కురావాలనే ల క్ష్యంతో చేపట్టిన ఈ సేవ కార్యక్రమం ప్రజల ఆరోగ్య భద్రతకు మరింత భరోసా కల్పిస్తుంద న్నారు. కార్యక్రమంలో హాస్పటల్ను సందర్శించి ఇన్స్టిట్యూల్ సీఈవో రామచంద్ర రావు, ప్రతిమ ఆసుపత్రి క్రిటికల్ కేర్ డాక్టర్ ప్రవీణ్, లక్షెట్టిపే ట ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్, లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయకు మార్, ఆర్టీఏ జిల్లా మెంబర్ శ్రీనివాస్, మేయర్ మధుకర్, లక్షెట్టిపేట మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి -నర్సయ్య, వైస్ ఛైర్మన్ రాజేశ్వ రి-వెంకటస్వామిగౌడ్, మార్కెట్ కమిటీఛైర్మన్ వెంకటేశ్వర్లు, పట్ణణ అధ్యక్షుడు సయ్యద్ షా హిద్ ఆలీ, పిఏసిఎస్ ఛైరన్లు నాగభూషణం, శ్రీనివాస్, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.