Minister Tummala: చేనేత రుణమాఫీకి రూ.27.14 కోట్లు
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:32 AM
రాష్ట్రంలో 2017 నుంచి 2023 వరకు 6,784 మంది చేనేత కార్మికులకు రూ.లక్షలోపు రుణ మాఫీ కోసం రూ.27.14 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ట్రంలో 2017 నుంచి 2023 వరకు 6,784 మంది చేనేత కార్మికులకు రూ.లక్షలోపు రుణ మాఫీ కోసం రూ.27.14 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చేనేత భరోసా, పొదుపు పథకం కింద రూ.303 కోట్లు, పావలా వడ్డీ కింద రూ.109 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, నెల్లికంటి సత్యం తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నాగేశ్వరరావు సమాధానమిస్తూ.. టెస్కో ద్వారా చేనేత కార్మికుల నుంచి రూ.587 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేసినట్టు తెలిపారు.