మేడారంలో గాయపడిన బాలుడి తల్లికి ఉద్యోగం
ABN , Publish Date - Apr 19 , 2026 | 06:10 AM
మేడారం దేవస్థానంలో రాతి శిల పడి కాలు కోల్పోయిన చిన్నారి యూవిన్ (విక్కి) కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. బాలుడు తల్లి సిద్దబోయిన స్వప్నకు దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ అవకాశం కల్పించింది.
నియామక పత్రం అందించిన మంత్రి సీతక్క
తాడ్వాయి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): మేడారం దేవస్థానంలో రాతి శిల పడి కాలు కోల్పోయిన చిన్నారి యూవిన్ (విక్కి) కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. బాలుడు తల్లి సిద్దబోయిన స్వప్నకు దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ అవకాశం కల్పించింది. ఈ మేరకు శనివారం ములుగు కలెక్టరేట్లో స్వప్నకు మంత్రి సీతక్క నియామక పత్రాన్ని అందించారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మార్చి 25న వనదేవతల ప్రాంగణంలో విక్కి ఆడుకుంటూ సమ్మక్క గద్దె చుట్టూ ఉన్న రాతి రెయిలింగ్ ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డాడు. అదే సమయంలో జారిన రాతి శిల చిన్నారి కాలుపై పడింది. దీంతో నుజ్జు నుజ్జు అయిన కాలును వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు.