Share News

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:25 PM

నెల 25 నుంచి 28వత తేదీ వరకు హైదరాబాదు లో నిర్వహించనున్న ఐద్వా 14వ జాతీయ మహాసభల ను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత కోరారు.

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
జిల్లా కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఐద్వా నాయకులు

- రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జ నవరి 20 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 25 నుంచి 28వత తేదీ వరకు హైదరాబాదు లో నిర్వహించనున్న ఐద్వా 14వ జాతీయ మహాసభల ను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాల్‌లో ఐద్వా జాతీయ మహాసభ ల పోస్టర్‌ను ఆవిష్కరించారు. హైదరాబాదులో ని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించ ను న్న ఐద్వా జాతీయ మహాసభలకు జాతీయ ప్యాట్రన్‌, మాజీ ఎంపీ బృందా కారత్‌, జాతీయ అధ్యక్షురాలు పీకే, ప్రధాన కార్యదర్శి ధావలే, నా యకులు సుభాషిణి అలీ, పుణ్యవతి హాజరవు తారని తెలిపారు. జయప్రదం చేయాలని ప్ర జలను కోరారు. ఐద్వా జిల్లా నాయకులు అంజ నమ్మ, నవనీత, స్వాతి, శ్రీదేవి, ధనలక్ష్మి, షేక్‌భా ను, సుభద్ర, రజిత పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 11:25 PM