నేడు సిర్పూర్ కాగజ్నగర్కు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:42 AM
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం సిర్పూర్ కాగజ్నగర్కు రానున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం సిర్పూర్ కాగజ్నగర్కు రానున్నారు. ఈ సందర్భంగా సిర్పూర్ కాగజ్నగర్తో పాటు మంచిర్యాల జిల్లాలో బహిరంగ సభ, రోడ్షో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు సిర్పూర్కు ఫడ్నవీస్ చేరుకుని 1 గంటకు ఎస్పీఎం గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభకు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిష్ షెలార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు తదితర ప్రముఖ నేతలు హాజరు కానున్నారు. ఈ బహిరంగ సభ అనంతరం సిర్పూర్ కాగజ్నగర్లోని లక్ష్మీనారాయణ మందిర్ నుంచి ప్రారంభించే రోడ్షో ముక్రామ్ చౌరస్తా, అర్చనా టెక్ చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ రోడ్ గుండా ప్రయాణించి మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద ముగియనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.