Share News

మంత్రి రిజైన్‌ చేస్తే సరిపోదు.. మళ్లీ జరగకుండా సంస్కరణలు తేవాలి: కవిత

ABN , Publish Date - Jul 26 , 2026 | 06:16 AM

నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత స్పందించారు.

మంత్రి రిజైన్‌ చేస్తే సరిపోదు.. మళ్లీ జరగకుండా సంస్కరణలు తేవాలి: కవిత

ఇంటర్నెట్ విభాగం: నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత స్పందించారు. కేవలం మంత్రి రిజైన్‌ చేస్తే సరిపోదని శనివారం కవిత ఎక్స్‌ లో పోస్ట్‌ చేశారు. పేపర్‌ లీకేజీలకు ఇది ఎంత మాత్రం పరిష్కారం కాదన్నారు. విద్యార్థులకు నిజంగా న్యాయం జరగాలంటే మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా సంస్కరణలు తేవాలని ఆమె కోరారు.

Updated Date - Jul 26 , 2026 | 06:18 AM