Share News

విదేశీ మెడికల్‌ గ్రాడ్యుయేట్లకు ఊరట

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:06 AM

విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి భారత్‌లో వృత్తిని చేపట్టాలనుకున్న విదేశీ మెడికల్‌ గ్రాడ్యుయేట్ల (ఎఫ్‌ఎంజీ)కు కేంద్రం పెద్ద ఊరటనిచ్చింది.

విదేశీ మెడికల్‌ గ్రాడ్యుయేట్లకు ఊరట

  • దేశవ్యాప్తంగా 43,250 ఇంటర్న్‌షిప్‌ సీట్ల కేటాయింపు

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి భారత్‌లో వృత్తిని చేపట్టాలనుకున్న విదేశీ మెడికల్‌ గ్రాడ్యుయేట్ల (ఎఫ్‌ఎంజీ)కు కేంద్రం పెద్ద ఊరటనిచ్చింది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను కంపల్సరీ రోటేటరీ మెడికల్‌ ఇంటర్న్‌షిప్‌(సీఆర్‌ఎంఐ) కోసం దేశవ్యాప్తంగా 43,250 సీట్లను కేటాయిస్తూ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్న్‌షిప్‌ సీట్ల కొరతపై విద్యార్థులు న్యాయస్థానాల ను ఆశ్రయించిన నేపథ్యంలో కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. సీట్ల కేటాయింపులో కొన్ని కీలక మార్పులు చేస్తూ అన్ని రాష్ట్రాల మెడికల్‌ కౌన్సిళ్లకు స్పష్టమైన మార్గదర్శకాలను పంపింది. కొత్తగా ప్రారంభమైన మెడికల్‌ కాలేజీల్లోని అన్ని ఇంటర్న్‌షిప్‌ సీట్లు(100ు) విదేశీ పట్టభద్రులకే దక్కుతాయి. అలాగే, 2022-23 నుంచి 2025-26 మధ్యకాలంలో అదనంగా పెరిగిన సీట్లన్నీ విదేశీ విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించింది. కాగా, సీట్ల కేటాయింపులో తెలుగు రాష్ట్రాలకు గణనీయమైన వాటా దక్కింది. తెలంగాణలో మొత్తం 4,871 సీట్లు అందుబాటులోకి రాగా, ఏపీలో మొత్తం 2,271 సీట్లను ఎఫ్‌ఎంజీల కోసం కేటాయించారు.

Updated Date - Mar 12 , 2026 | 05:06 AM