చిట్యాలలో ట్రాన్స్జెండర్ అభ్యర్థి విజయం
ABN , Publish Date - Feb 14 , 2026 | 04:05 AM
నల్లగొండ జిల్లా చిట్యాల మునిసిపాలిటీలోని 1వ వార్డు నుంచి ట్రాన్స్జెండర్ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన సీపీఎం..
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా చిట్యాల మునిసిపాలిటీలోని 1వ వార్డు నుంచి ట్రాన్స్జెండర్ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి, 2018లో నకిరేకల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన జిట్టా నగేశ్పై స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ట్రాన్స్జెండర్ నాగిళ్ల సుధాకర్ అలియాస్ కావేరి 102 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మునిసిపోల్స్లో ఓ ట్రాన్స్జెండర్ అభ్యర్థి గెలుపొందడం ఇదే మొదటిసారి. చిట్యాలలో కాంగ్రె్సకు 9 స్థానాలు, బీఆర్ఎ్సకు 2 స్థానాలు దక్కాయి. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.