Share News

నేటి నుంచి పెరగనున్న ఎండ తీవ్రత

ABN , Publish Date - Mar 27 , 2026 | 04:07 AM

నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో.. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవచ్చని..

నేటి నుంచి పెరగనున్న ఎండ తీవ్రత

  • నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో.. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవచ్చని.. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం నుంచి రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 39-41 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ ,నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది.

Updated Date - Mar 27 , 2026 | 04:07 AM