Share News

వైభవంగా పెద్దమ్మ దేవత ఉత్సవాలు

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:13 PM

సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో యాదవుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ దేవత ఆ లయ ఉత్సవాలకు శనివారం నాగర్‌కర్నూల్‌ ఎం పీ డాక్టర్‌ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డా క్టర్‌ వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు.

వైభవంగా పెద్దమ్మ దేవత ఉత్సవాలు
అమ్మవారి సన్నిధిలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ

- సుఖశాంతులు కోరుతూ ఎంపీ, ఎమ్మెల్యే పూజలు

వంగూరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో యాదవుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ దేవత ఆ లయ ఉత్సవాలకు శనివారం నాగర్‌కర్నూల్‌ ఎం పీ డాక్టర్‌ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డా క్టర్‌ వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారిని శాలువాలతో సన్మా నించారు. ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా చక్కగా పెద్దమ్మ దేవత ఆలయం నిర్మించి, వైభ వంగా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయ మన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంక్షేమ క మిషన్‌ సభ్యుడు కేవీఎన్‌రెడ్డి, రాష్ట్ర విద్యాకమిష న్‌ సభ్యుడు చారకొండ వెంకటేష్‌, గ్రామాభివృ ద్ధి కమిటీ చైర్మన్‌, సీఎం సోదరులు ఎనుముల కృష్ణారెడ్డి, ఎనుముల జగాల్‌, మాజీ ఎంపీపీ భీమమ్మ, సర్పంచ్‌ మల్లెపాకుల వెంకటయ్య, ఉప సర్పంచ్‌ వేమారెడ్డి, డీ సీసీ ప్రధాన కార్యదర్శి పులి జాల కృష్ణారెడ్డి, పార్టీ మం డల అధ్యక్షుడు సి.రాజశే ఖ ర్‌రెడ్డి, ముత్యాల లక్ష్మారెడ్డి, లాలుయాదవ్‌, జంగయ్య యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 11:13 PM