పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి
ABN , Publish Date - May 24 , 2026 | 11:29 PM
పండు గలు శాంతియుత వా తావరణంలో జరుపుకో వాలని ఎస్ఐ కృష్ణదేవ అన్నారు.
- శాంతి సమావేశంలో ఎస్ఐ కృష్ణదేవ
ఊర్కొండ, మే 24 (ఆంధ్రజ్యోతి) : పండు గలు శాంతియుత వా తావరణంలో జరుపుకో వాలని ఎస్ఐ కృష్ణదేవ అన్నారు.ఆదివారం మం డల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో బక్రీద్ పండు గను పురస్కరించుకొని మత పెద్దలు, నాయకు లతో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఆయ న మాట్లాడుతూ పండుగ వేళ ఇతర మతస్థుల మనోభావాలను దెబ్బతీయకుండా మీ మత సంప్రదాయాలను కొనసాగించుకోవాలని అన్నా రు. గ్రామాల్లో అందరు కలిసిమెలిసి ఉన్న వా తావరణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటా మని చట్టపరిధిలో తమ కార్యకలాపాలు ఉండా లని సూచించారు. ఆసత్య ప్రచారం సోషల్ మీ డియాలో షేర్ చేయడం లాంటివి చట్టపరంగా కఠిన చర్యలుంటాయని తెలిపారు. బక్రీద్ పం డుగను ఐక్యంగా ఉండి సంతోషంగా జరుపుకో వాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఊ ర్కొండపేట సర్పంచ్ అబ్దుల్ రషీద్, ఊర్కొండ మాజీ సర్పంచ్ మ్యాకల శ్రీనివాసులు మండల నాయకులు మహ్మద్ ఖాజ, రఫీక్, బాసీత్ తదితరులు ఉన్నారు.