సీసీ కెమెరాలతోనే నేరాల నియంత్రణ
ABN , Publish Date - Jul 23 , 2026 | 11:32 PM
సీసీ కెమెరాల ఏర్పాటుతోనే నేరాలను నియంత్రించవచ్చునని జ్యువెల్లరీ షాపు యజమానులు నిబం ధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీ భాస్కర్ అన్నారు. గు రువారం మార్కెట్ రోడ్డులో గల గోల్డ్షాపులు, షాపింగ్ మాల్స్ను ఏసీపీ ప్రకాశ్తో కలిసి తనిఖీ చేశారు.
డీసీపీ భాస్కర్
మంచిర్యాలక్రైం, జూలై23 (ఆంధ్రజ్యోతి): సీసీ కెమెరాల ఏర్పాటుతోనే నేరాలను నియంత్రించవచ్చునని జ్యువెల్లరీ షాపు యజమానులు నిబం ధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీ భాస్కర్ అన్నారు. గు రువారం మార్కెట్ రోడ్డులో గల గోల్డ్షాపులు, షాపింగ్ మాల్స్ను ఏసీపీ ప్రకాశ్తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాపు యజమానులు తప్పకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవా లన్నారు. సీసీ కెమెరాలతోనే నేరాలను నియంత్రించవచ్చునన్నారు. చోరీ జరిగినప్పుడు సీసీ కెమెరాల ద్వారా నిందితులను సులభంగా గుర్తిం చ డంతో ప్రాపర్టీ, రికవరీ సులభతరమవుతుందన్నారు. సీసీ కెమెరాలను షాపులోనే కాకుండా షాపు వెనుకభాగముతో పాటు రోడ్డు పూర్తిగా కనిపించే విధంగాసీసీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసేందుకు మున్సిపాలిటికి ఫిర్యా దు చేయడంతో వారి ట్రేడ్ లైసెన్స్ రద్దు అవుతుందని హెచ్చరించారు. నేరాల నియంత్ర ణకోసం ప్రతి రోజు ఆర్మ్డ్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మంచిర్యాల సీఐ ప్రమోద్రావు, సీఐ రవీందర్, సత్యనారాయణ, ఎస్ఐలు