కాలగర్భంలో ఎఫ్ఎస్టీ ప్లాంట్ల నిర్మాణం...!
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:26 PM
మానవ వ్య ర్థాలతో ఎరువును తయారు చేసే ప్రక్రియకు ఆది నుం చి ఆటంకాలు ఎదురవుతున్నాయి. 2021లో అప్పటి ప్ర భుత్వం ఎఫ్ఎస్టీపీ (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లను నెలకొల్పేందుకు సన్నద్ధమై స్థలాలు కేటాయించాలని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది.
=================
మానవ వ్యర్థాలతో ఎరువు తయారీకి ఆటంకాలు
జిల్లాకు మూడు ప్లాంట్లు మంజూరు
ఐదేళ్లు కావస్తున్నా ప్రారంభంకాని పనులు
భూముల కేటాయింపుపై ప్రజల అభ్యంతరం
మంచిర్యాల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మానవ వ్య ర్థాలతో ఎరువును తయారు చేసే ప్రక్రియకు ఆది నుం చి ఆటంకాలు ఎదురవుతున్నాయి. 2021లో అప్పటి ప్ర భుత్వం ఎఫ్ఎస్టీపీ (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లను నెలకొల్పేందుకు సన్నద్ధమై స్థలాలు కేటాయించాలని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్లు గడు స్తున్నా ఇంతవరకు ఆ దిశగా కార్యాచరణ జరుగక పో గా, ఇక వాటి నిర్మాణం కాలగర్భంలో కలిసినట్లేనన్న వ్యా ఖ్యలు వినిపిస్తున్నాయి. 2021లో ప్రారంభమైన ప్లాంట్ల నిర్మాణం ప్రభుత్వం మారేంత వరకు కూడా పట్టా లె క్కకపోవడం గమనార్హం. ఈలోగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఎఫ్ఎస్టీపీలు మరుగున పడ్డాయి. జిల్లాలో ని మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపా లిటీల లో ఒక్కొక్క ఎఫ్ఎస్టీ ప్లాంట్ను సుమారు రూ. 4 కోట్ల తో ఏర్పాటు చేసేందుకు టెండర్ ప్రక్రియను కూడా పూ ర్తి చేశారు. ప్లాంట్ ప్రారంభమైన నాటి నుంచి 30 ఏళ్ల వరకు సదరు కాంట్రాక్టరే నిర్వహణ బాధ్యతలు చేప ట్టాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్లాంట్ నిర్మాణా నికి అవసరమైన ఎకరం స్థలాన్ని కూడా ఆయా మున్సి పాలిటీలు కాంట్రాక్టర్లకు అప్పగించగా అగ్రిమెంట్ ప్రక్రి య కూడా పూర్తయి పనులు చేపట్టనున్న తరుణంలో అర్థాంతరంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మానవ వ్య ర్థాలను బయట పడేయం ద్వారా వాతావరణం కలుషి తమై ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుండటంతో ఎఫ్ఎస్టీపీల నిర్మాణం అంశం తెరపైకి వచ్చింది.
పర్యావరణ పరిరక్షణకు దోహదం....
నివాస గృహాల్లోని సెప్టిక్ ట్యాంకుల నుంచి మున్సిపా లిటీల ద్వారా లైసెన్సు పొందిన స్లడ్జింగ్ ఆపరేటర్లు ము రికిని సేకరించి నేరుగా ఎఫ్ఎస్టీపీలకు తరలిస్తారు. అ క్కడ దాన్ని బ్యాంకర్లో డంప్ చేసిన తరువాత ఎరువు గా మారుస్తారు. ఇలా తయారు చేసిన ఎరువును తొ లుత మున్సిపాలిటీల పరిధిలోని మొక్కలకు ఉపయో గిస్తారు. పంట పొలాలకు, చేలకు అవసరమైన రైతులు ఎరువును కొనుగోలు చేసి వినియోగిస్తారు. సాధారణం గా ఇండ్లలోని సెప్టిక్ ట్యాంకులు నిండగానే ప్రైవేటు ఆ పరేటర్లు దాన్ని సేకరించి బహిరంగ ప్రదేశాల్లో డంప్ చేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో పారబోయడం మూలం గా వాతావరణం కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా చెరువులు, కుంటలు, కాలువలు, నదు లు, వాగుల పక్కన పడవేస్తే నీరు కలుషితమై ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలుంటాయి. ఈ క్ర మంలోనే సెప్టిక్ ట్యాంకుల నుంచి మురికి సేకరించేం దుకు ఆపరేటర్లకు మున్సిపాలిటీ లైసెన్సులు మంజూరు చేశాయి. మంచిర్యాలలో నలుగురు, బెల్లంపల్లిలో ఇద్దరు చొప్పున ఆపరేటర్లను ఎంపిక చేసిన అధికారులు వారికి ఇప్పటికే లైసెన్సులు సైతం జారీ చేశారు. లైసెన్సులు జారీ అయినందున బహిరంగ ప్రదేశాల్లో మురికి డంప్ చేయడాన్ని నిషేధిస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్ర కటించారు కూడా. ఇక మీదట ఇండ్లలోని సెప్టిక్ ట్యాం కుల నుంచి కేవలం లైసెన్సు పొందిన ఆపరేటర్లు మా త్రమే మురికిని సేకరించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి.
అభ్యంతరాల వెల్లువ.....
మంచిర్యాల నగర పరిధిలోని సాయికుంటలో ఎఫ్ ఎస్టీపీ కోసం అధికారులు స్థలం కేటాయించారు. స్థలం నివాస గృహాలకు దగ్గరగా ఉండటంతో స్థానిక ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నివాస గృహాలకు కేవలం 100 మీటర్ల దూరంలో ప్లాంటు నిర్మాణానికి స్థలం కే టాయించడంతో భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యంపై ప్రభా వం చూపుతుందని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశా రు. పర్యావరణశాఖ నిబంధనల మేరకు నివాస గృహా లకు కనీసం 200 మీటర్ల దూరం ఉండాలని, మరో చో ట ప్లాంటు నిర్మాణం చేపట్టాలని కోరుతూ స్థానికులు అ ప్పటి కలెక్టర్ భారతి హోళికేరితోపాటు ఎమ్మెల్యేకు విన తిపత్రాలు అందజేశారు.
నిబంధనలు ఇలా.....
ప్లాంటు ఏర్పాటు చేసే స్థలం విషయంలో పర్యావర ణ శాఖ కొన్ని నిబంధనలు విధించింది. ఆ నిబంధనల ప్రకారం నివాస గృహాలు, మతపరమైన స్థలాలు, విద్యా లయాలు, ఆసుపత్రులు, నీటి ప్రదేశాలు, పార్కులు, రో డ్లకు నిర్ణీత దూరంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జాతీయ రహదారికి 100 మీటర్లు, రాష్ట్ర రహదారికి 50 మీటర్లు అంతర్గత రోడ్ల నుంచి 25 మీటర్లు, నదుల నుంచి 100 మీటర్లు, చెరువులు, కొలనుల నుంచి 200 మీటర్లు, నివాస గృహాలు, పార్కులు, మంచినీటి బావు లు, హైవేలకు 200 మీటర్ల దూరంలో ఎఫ్ఎస్టీపీల ఏర్పాటుకు స్థలం కేటాయించాల్సి ఉంటుంది. అయితే జిల్లా కేంద్రంలోని సాయికుంటలో నివాస గృహాల నుం చి కేవలం 100 మీటర్ల లోపు స్థలం కేటాయించడంతో స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో ట్యాంక్ నిర్మా ణానికి అవసరమై స్థలాన్ని అండాళమ్మ కాలనీలో ఎంపి క చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అండాళమ్మ కాలనీ లో ఇప్పటికే డంప్ యార్డు కారణంగా అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండగా, ఎఫ్ఎస్టీపీ ఏర్పా టుకు వారు అంగీకరించ లేదు. మరో చోట స్థలం కేటా యించాలని అనుకున్నప్పటికీ, అంతటితోనే ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే ఎఫ్ఎస్టీ ప్లాంట్ల వల్ల అనేక లాభాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అవి ఏర్పాటయితే నగరంలో పర్యావరణం కలుషితం కాకుం డా ఉంటుందని చెబుతున్నారు. ప్లాంట్ల కారణంగా ఎ లాంటి దుర్వాసన ఉండదని, ఆ ప్రాంతంలో విరివిగా మొక్కలు పెంచడం వల్ల ఆహ్లాదకర వాతావరణం కూ డా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే నగరానికి దూరంలో అనేక ప్రభుత్వ స్థలాలు ఉన్నందున ప్లాంట్ ను అక్కడ నిర్మిస్తే ఎలాంటి అభ్యంతరాలు ఉండవనే అ భిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికా రులు ఈ విషయమై ధృష్టిసారించి, ఆమోదయోగ్యమైన చోట స్థలాలు ఎంపిక చేయడంతోపాటు త్వరితగతిన ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.