భాగవత్ను ఆపలేని కేంద్ర ప్రభుత్వం రేవంత్రెడ్డిని ఎందుకు ఆపింది?: నారాయణ
ABN , Publish Date - Aug 29 , 2026 | 03:42 AM
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అమెరికా పర్యటనను అడ్డుకోలేకపోయిన కేంద్ర ప్రభుత్వం సీఎం రేవంత్రెడ్డి పర్యటనను ఎందుకు అడ్డుకుందని సీపీఐ సీనియర్ నాయకుడు కె.నారాయణ ప్రశ్నించారు.
హైదరాబాద్, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అమెరికా పర్యటనను అడ్డుకోలేకపోయిన కేంద్ర ప్రభుత్వం సీఎం రేవంత్రెడ్డి పర్యటనను ఎందుకు అడ్డుకుందని సీపీఐ సీనియర్ నాయకుడు కె.నారాయణ ప్రశ్నించారు. భాగవత్ వీసా రద్దు చేయాలని అమెరికా మత స్వేచ్ఛ కమిషన్ కోరిందని, న్యూయార్క్ మేయర్ మమ్దాని కూడా ఆర్ఎ్సఎస్ కార్యక్రమాన్ని వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం అమెరికా పర్యటనకు వెళుతున్న సీఎంను అడ్డుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా అని ఆయన ప్రశ్నించారు.