బీఆర్ఎస్వి డైవర్షన్ పాలిటిక్స్
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:58 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సర్పంచు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
వారెన్ని చేసినా ప్రజలు కాంగ్రెస్ వైపే: పొన్నం
వేములవాడ టౌన్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సర్పంచు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు కాంగ్రెస్ వైపే నిలిచారని చెప్పారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వరాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివా్సతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి భీమేశ్వర గెస్ట్ హాస్లో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత అడుగుతున్న ప్రశ్నలకు ఆ పార్టీ నేతలు జవాబు చెప్పాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో మునిసిపాలిటీలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. మరింత అభివృద్ధి చేయడానికి మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అఽభ్యర్థులను గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదని, తాము నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.