రేపు తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:24 AM
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నితిన్ నబీన్ తొలిసారిగా తెలంగాణలో పర్యటించనున్నారు. మహబూబ్నగర్ జిల్లా ...
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నితిన్ నబీన్ తొలిసారిగా తెలంగాణలో పర్యటించనున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్వీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం జరగనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ రాష్ట్ర శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.