Share News

భారతి బిల్డర్స్‌కు భారీ జరిమానా

ABN , Publish Date - Mar 14 , 2026 | 05:57 AM

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని ‘భారతి లేక్‌వ్యూ అపార్ట్‌మెంట్స్‌’ ప్రాజెక్టులో చట్టవ్యతిరేక ప్రీ లాంచ్‌ స్కీమ్‌ పేరుతో డబ్బు వసూలు చేసిన భారతి బిల్డర్స్‌ సంస్థకు తెలంగాణ రెరా షాక్‌ ఇచ్చింది.

భారతి బిల్డర్స్‌కు భారీ జరిమానా

  • రూ.4.74 కోట్ల ఫెనాల్టీ విధిస్తూ రెరా నిర్ణయం

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని ‘భారతి లేక్‌వ్యూ అపార్ట్‌మెంట్స్‌’ ప్రాజెక్టులో చట్టవ్యతిరేక ప్రీ లాంచ్‌ స్కీమ్‌ పేరుతో డబ్బు వసూలు చేసిన భారతి బిల్డర్స్‌ సంస్థకు తెలంగాణ రెరా షాక్‌ ఇచ్చింది. ఆ సంస్థకు ఏకంగా రూ.4,74,17,729 జరిమానా విధిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. పలు నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ సంస్థను డీఫాల్టర్‌ ప్రమోటర్‌గా ప్రకటిస్తూ.. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన నగదును 60 రోజుల్లోగా వాపసు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2021లో ప్రీ-లాంచ్‌ ఆఫర్ల పేరుతో కొనుగోలుదారుల నుంచి భారీ మొత్తంలో నిధులు వసూలు చేశారని ఫిర్యాదులపై కమిటీ విచారణ జరిపింది. 24 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఆ సంస్థ విఫలమయిందని, కనీస చట్టబద్ధమైన అనుమతులు, రెరా రిజిస్ట్రేషన్‌ లేకుండా నిధులు సేకరించడం, ఎటువంటి నిర్మాణపనులు చేపట్టకపోవడంపై అథారిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రూల్స్‌-2017(రూల్‌-15) ప్రకారం వడ్డీతో సహా 60 రోజుల్లో వినియోగదారులకు డబ్బులు వాపసు ఇవ్వాలని నిర్దేశించింది.

Updated Date - Mar 14 , 2026 | 05:57 AM