బండి భగీరథ్కు 3 రోజుల పోలీసు కస్టడీ
ABN , Publish Date - May 27 , 2026 | 05:21 AM
పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అనుమతిస్తూ మేడ్చల్ జిల్లా కోర్టు ఆదేశాలు
డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో నేడు విచారణ
హైదరాబాద్ సిటీ/మేడ్చల్, మే 26(ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో భగీరథ్ను బుధవారం విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిచాడన్న ఆరోపణలతో బండి బగీరథ్పై ఈ నెల 8న పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసు విచారణాధికారి కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆదేశాలతో 5 బృందాలుగా రంగంలోకి దిగిన పోలీసులు.. ఈనెల 16న భగీరథ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే, నిందితుడిని పూర్తిస్థాయిలో విచారించి మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పేట్బషీరాబాద్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు.. ఈ ఆరోపణలు నిజం కాదని, కుట్రపూరితంగా ఇరికించారని, ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై మంగళవారం వాదనలు విన్న మేడ్చల్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి తిరుపతి.. పోలీసుల వాదనతో ఏకీభవించారు. బండి భగీరథ్ను మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైల్లో రిమాండ్లో ఉన్న భగీరథ్ను పేట్బషీరాబాద్ పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. కాగా, నిందితుడిని పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారిస్తారా? లేక విచారణ పర్యవేక్షణ అధికారి డీసీపీ రితిరాజ్ కార్యాలయంలో విచారిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.