Share News

Corruption: అడిషనల్‌ కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌ ఆదేశాల మేరకే లంచం

ABN , Publish Date - Jan 10 , 2026 | 04:56 AM

పౌర సరఫరాల శాఖ సంస్థ మేనేజర్‌ జగన్మోహన్‌ ఏసీబీకి చిక్కిన కేసు కీలక మలుపు తిరిగింది. అడిషనల్‌ కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌ ఆదేశాల మేరకే లంచం తీసుకున్నట్లు జగన్మోహన్‌....

Corruption: అడిషనల్‌ కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌ ఆదేశాల మేరకే లంచం

  • ఏసీబీ విచారణలో పౌరసరఫరాల శాఖ సంస్థ మేనేజర్‌ వెల్లడి

  • అడిషనల్‌ కలెక్టర్‌ను 4గంటల పాటు విచారించిన ఏసీబీ అధికారులు

వనపర్తి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): పౌర సరఫరాల శాఖ సంస్థ మేనేజర్‌ జగన్మోహన్‌ ఏసీబీకి చిక్కిన కేసు కీలక మలుపు తిరిగింది. అడిషనల్‌ కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌ ఆదేశాల మేరకే లంచం తీసుకున్నట్లు జగన్మోహన్‌ విచారణలో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కాశీవిశ్వనాథ్‌ను విచారించారు. ఆ సమయంలో అడిషనల్‌ కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌ అందుబాటులో లేరు. దీంతో ఆయన్ను శుక్రవారం పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ కార్యాలయానికి పిలిపించి, 4గంటల పాటు విచారించారు. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌ బాలకృష్ణను వివరణ కోరగా సమగ్ర దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. సీఎంఆర్‌ కేటాయింపు కోసం ఓ మిల్లర్‌ నుంచి గురువారం రాత్రి జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ జగన్మోహన్‌ రూ.50 లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటనలో జగన్మోహన్‌తో పాటు కారు డ్రైవర్‌ లక్ష్మణ్‌ నాయక్‌లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

Updated Date - Jan 10 , 2026 | 04:56 AM