ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు
ABN , Publish Date - Aug 16 , 2026 | 05:41 AM
దేశ 80వ స్వాతంత్య్ర దిన వేడుకలను శనివారం ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): దేశ 80వ స్వాతంత్య్ర దిన వేడుకలను శనివారం ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లోని ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ప్రధానకార్యాలయంలో సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య, ఏబీఎన్- ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాశ్, ఉభయ సంస్థల్లోని అన్ని విభాగాల అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.