Share News

41 మంది ఐఏఎస్‌లకు కేంద్రంలో సెక్రటరీ హోదా

ABN , Publish Date - Mar 01 , 2026 | 02:39 AM

దేశంలోని పలు రాష్ట్రాల కేడర్‌లలో పనిచేస్తున్న ఐఏయ్‌సలకు వారి హోదాను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

41 మంది ఐఏఎస్‌లకు కేంద్రంలో సెక్రటరీ హోదా

  • ఆమోదించిన క్యాబినెట్‌ నియామకాల కమిటీ

  • తెలంగాణ కేడర్‌లో సంజయ్‌కుమార్‌కు కూడా..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): దేశంలోని పలు రాష్ట్రాల కేడర్‌లలో పనిచేస్తున్న ఐఏయ్‌సలకు వారి హోదాను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 41 మంది ఐఏఎస్‌లకు (1990-1995 బ్యాచ్‌) సెక్రటరీ హోదా కల్పిస్తూ క్యాబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఆ వివరాలను సంబంధిత అఽధికారులకు తెలుపుతూ సమాచార పత్రాన్ని శనివారం పంపింది. ఇందులో భాగంగా తెలంగాణ కేడర్‌లో ఉన్న ఐఏయస్‌ సంజయ్‌కుమార్‌కు కూడా కేంద్రంలో సెక్రటరీ స్థాయి హోదా దక్కింది. ప్రస్తుతం సంజయ్‌కుమార్‌ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖకు ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - Mar 01 , 2026 | 02:40 AM