Share News

మాన్సికి రజతం

ABN , Publish Date - Aug 23 , 2026 | 05:25 AM

భారత యువ రెజ్లర్లు మాన్సి లాథర్‌, తన్వీ మగ్దుమ్‌, కోమల్‌ అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌లో...

మాన్సికి  రజతం

బ్రాటిస్లావా (స్లోవేకియా): భారత యువ రెజ్లర్లు మాన్సి లాథర్‌, తన్వీ మగ్దుమ్‌, కోమల్‌ అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌లో పతకాలతో మెరిశారు. మహిళల 68 కిలోల ఫైనల్లో మాన్సి 1-2తో చెన్‌లింగ్‌ (చైనా) చేతిలో ఓడి రజతం సాధించింది. 57 కిలోల పతక పోరులో తన్వి 10-4తో క్రకోవోస్కా (కెనడా)పై, 59 కిలోల పోరులో కోమల్‌ 5-2తో ఎదా బలాజ్‌ (హంగేరీ)పై గెలిచి కాంస్యాలు దక్కించుకున్నారు.

Updated Date - Aug 23 , 2026 | 05:25 AM