Share News

సురక్షితంగా భారత్ చేరుకున్న పీవీ సింధు

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:58 AM

పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆమె సురక్షితంగా భారత్ చేరుకున్నారు.

సురక్షితంగా భారత్ చేరుకున్న పీవీ సింధు
PV Sindhu

స్పోర్ట్స్ డెస్క్: గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు (PV Sindhu) చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అక్కడ భయం భయంగా ఉందంటూ ఆమె సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించారు. ఎట్టకేలకు యుద్ధం మధ్య పీవీ సింధు సురక్షితంగా భారత్‌ చేరుకున్నారు. మంగళవారం ఆమె దుబాయ్ నుంచి బయలుదేరి బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగారు. ఈ విషయాన్ని సింధు ‘ఎక్స్‌’లో వెల్లడించారు.

Updated Date - Mar 03 , 2026 | 11:58 AM