ఫెన్సింగ్లో లోకేష్కు రజతం
ABN , Publish Date - Aug 11 , 2026 | 02:07 AM
అండర్-23 కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి లోకేష్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): అండర్-23 కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి లోకేష్ పతకం కొల్లగొట్టాడు. నైజీరియాలోని లాగో్సలో జరిగిన ఈ పోటీల్లో భారత ఫెన్సర్లు మొత్తం 17 పతకాలు సాధించారు. ఇందులో 4 స్వర్ణ, 4 రజత, 9 కాంస్య పతకాలున్నాయి. లోకేష్ ఈపీ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచి, రజతంతో మెరిశాడు.