టీ20 వరల్డ్ కప్2026: ఇషాన్ కిషన్ విధ్వంసం.. భారత్ భారీ స్కోర్
ABN , Publish Date - Feb 12 , 2026 | 08:48 PM
టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా ఇవాళ(గురువారం) నమీబియాతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 209 పరుగులు భారీ స్కోర్ చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా ఇవాళ(గురువారం)నమీబియాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్(24 బంతుల్లో 61) చెలరేగి ఆడటంతో టీమిండియా 209 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య(28 బంతుల్లో 52) కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లకు భారత్ 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.