Paramahamsa Yogananda Jayanti: కన్నుల పండువగా పరమహంస యోగానంద జయంతి వేడుకలు
ABN, Publish Date - Jan 05 , 2026 | 07:54 PM
పరమహంస యోగానంద జయంతి సందర్భంగా, దివ్యమైన ఆయన మార్గదర్శనాన్ని కోరుకునే శ్రద్ధగల సాధకులు యోగానంద సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతూనే ఉన్నారు. శాశ్వత ఆనందం కోసమైన అన్వేషణ..
1/6
యోగదా సత్సంగ సొసైటీ వ్యవస్థాపకుడు, ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
2/6
తిరుపతి నలందా నగర్లో నూతన ధ్యాన కేంద్రాన్ని యోగదా సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అజ్ఞానమనే చీకటిని తొలగించే వాడే గురువని చెప్పారు.
3/6
భగవంతుడి నిశ్శబ్ద స్వరమే గురువని, సాధన అంటే దయ, క్షమ, సేవా తత్పరత అలవరచుకోవడమేనని వైఎస్ఎస్ స్వామి స్మరణానంద అన్నారు.
4/6
హైదరాబాద్ మధురానగర్ లోని సాగి రామకృష్ణంరాజు కమ్యూనిటీ హాల్ లో వైఎస్ఎస్ భక్తులు క్రియాయోగ ధ్యానం, భజనలు, పుష్పాంజలి నిర్వహించారు.
5/6
యోగానంద ముకుంద లాల్ ఘోష్ గా 1893 జనవరి 5న భారతదేశంలోని గోరఖ్ పూర్ లో, ఆధ్యాత్మిక నిబద్ధత గల తల్లిదండ్రులైన భగవతి చరణ్ ఘోష్, జ్ఞానప్రభా ఘోష్ లకు జన్మించారు.
6/6
చిన్న వయస్సు నుంచే ఆయన ప్రార్థన, ధ్యానంపై ఆకర్షితులయ్యారు, నిగూఢమైన ఆంతరిక అవస్థలను అనుభూతి చెందారు, దివ్యకాంతి దర్శనాలతో సహా. వీటిని ఆయన తర్వాత ఒక యోగి ఆత్మకథ లో ప్రస్తావిస్తూ, దేవుణ్ణి అన్వేషించాలనేదే అన్నిటికన్నా ముఖ్యమని తనలో శాశ్వత నిశ్చయం రూపొందించిన సందర్భాలుగా వాటిని అభివర్ణించారు.
Updated at - Jan 05 , 2026 | 07:55 PM