Medaram Maha Jatara 2026: మేడారం మహా జాతర 2026 ఏర్పాట్లు
ABN, Publish Date - Jan 04 , 2026 | 08:13 PM
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క-సారలమ్మ మహా జాతర 2026లో జనవరి 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా మేడారంలో ఘనంగా జరగనుంది. ఈ జాతరకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపడుతోంది.
1/10
అద్భుతంగా మేడారం మహా జాతర 2026 ఏర్పాట్లు.. మంత్రులు సీతక్క, పొంగులేటి పర్యటన
2/10
ఇవాళ (జనవరి 4, 2026న) మంత్రులు దనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడారం పర్యటించి గద్దెల అభివృద్ధి పనులను పరిశీలించారు.
3/10
మేడారం జాతర ప్రాంతం: అడవుల మధ్య సమ్మక్క-సారలమ్మ గద్దెలు, కోట్లాది భక్తుల సమ్మేళనం.
4/10
ఈసారి శాశ్వత ఆలయ నిర్మాణం, 8 ద్వారాలు, ప్రాకారాలతో మరింత వైభవం.
5/10
మంత్రి సీతక్క పరిశీలన: పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గద్దెల పనులను పర్యవేక్షిస్తూ. ఆదివాసీ సంస్కృతిని పరిరక్షిస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు
6/10
రెవెన్యూ మంత్రి పొంగులేటి పనులను పరిశీలిస్తూ.. సీఎం రేవంత్ దూరదృష్టితో 200-250 ఏళ్లు నిలిచే నిర్మాణాలు చేస్తున్నామని చెప్పారు.
7/10
విశాలమైన రోడ్లు, హెలిప్యాడ్లు, హెలికాప్టర్ సేవలు కల్పిస్తూ భక్తులకు సులభ రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు.
8/10
జంపన్న వాగు స్నానాలు, పారిశుద్ధ్యం, వైద్య సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
9/10
ఈ జాతరకు 1-2 కోట్ల భక్తులు రానున్నారు.. ప్రభుత్వం రూ. 251 కోట్లతో శాశ్వత అభివృద్ధి చేపడుతోంది.
10/10
గిరిజన సంస్కృతి, భక్తి కలిసిన మహోత్సవం ఈ జాతర
Updated at - Jan 04 , 2026 | 08:13 PM