చిత్తూరులో ఆర్కే రోజా దిష్టిబొమ్మ దగ్ధం
ABN, Publish Date - Apr 08 , 2026 | 10:08 PM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణను అసభ్య పదజాలంతో మాజీ మంత్రి ఆర్కే రోజా దూషించారు. ఆర్కే రోజా తీరు నిరసిస్తూ.. చిత్తూరులోని స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఆమె దిష్టిబొమ్మను తెలుగు మహిళలు దగ్ధం చేశారు.
1/5
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణను అసభ్య పదజాలంతో మాజీ మంత్రి ఆర్కే రోజా దూషించారు. ఆర్కే రోజా తీరు నిరసిస్తూ.. చిత్తూరులోని స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఆమె దిష్టిబొమ్మను తెలుగు మహిళలు దగ్ధం చేశారు.
2/5
రోజా దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి చీపురు.. చాటలతో కొడుతూ నిరసన తెలిపిన తెలుగు మహిళలు.
3/5
సొంత ఇంటిలో తల్లి చెల్లిని గౌరవించలేని వైఎస్ జగన్ బయట సమాజంలో మహిళలను ఎలా గౌరవిస్తారో ఆర్కే రోజాకు తెలియదా? అంటూ తెలుగు మహిళలు ఎద్దేవా చేశారు.
4/5
వైసీపీ ప్రభుత్వంలో ఎంతోమంది మహిళలకు ఎన్నో అన్యాయాలు ఎదురయ్యాయన్నారు. ఆనాడు ప్రశ్నించని ఆర్కే రోజాకు ఈ రోజు మహిళలు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని తెలుగు మహిళలు పేర్కొన్నారు.
5/5
నోరు అదుపులోకి పెట్టుకుని ప్రవర్తించుకుంటే సాటి మహిళలే తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ ఆర్కే రోజాను తెలుగు మహిళలు హెచ్చరించారు.
Updated at - Apr 08 , 2026 | 10:10 PM