AP Dwakra Mela 2026: గుంటూరులో సరస్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ABN, Publish Date - Jan 08 , 2026 | 09:37 PM
ఇక నుంచి ఆన్లైన్లోనే డ్వాక్రా పొదుపు సంఘాలు రుణాలు తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తన మాట విన్న కుటుంబాలు ఇప్పుడు బాగుపడ్డాయని సంతోషం వ్యక్తం చేశారు. అధిక తలసరి ఆదాయం పొందేది మన తెలుగువారి కుటుంబాలేనని స్పష్టం చేశారు.
1/10
డ్వాక్రాతో మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
2/10
గుంటూరు నగర శివారులో ఈ రోజు సరస్ మేళా 2026.. అఖిల భారత డ్వాక్రా బజారును సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
3/10
సొంత కాళ్లపై ఆడబిడ్డలు నిలబడాలనే ఉద్దేశ్యంతోనే డ్వాక్రా స్థాపించినట్లు చంద్రబాబు తెలిపారు.
4/10
టీడీపీకి మహిళలతో ప్రత్యేక అనుబంధం ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. వారి కష్టాలు చూసే దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని వివరించారు.
5/10
సంజీవని పథకంతో ఐదు కోట్ల ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చామని చంద్రబాబు వివరించారు.
6/10
ఇక ఆన్లైన్లోనే పొదుపు సంఘాలు రుణాలు తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
7/10
పొదుపు సంఘాలు రూ. 26 వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశాయని.. 1.13 కోట్ల మంది సభ్యులు ఉన్నారన్నారని.. రూ. 5,200 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
8/10
దేశంలోని బెస్ట్ ప్రాక్టీసెస్ను ఏపీకి తీసుకురావాలన్నారు చంద్రబాబు.. మహిళల శక్తి తనకు తెలుసునని చంద్రబాబు చెప్పారు.
9/10
మన రాష్ట్రంలోని మహిళలు.. ఉత్తర భారతదేశంలోని మహిళలకు శిక్షణ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు.
10/10
మహిళా సంఘాలను సమర్థవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
Updated at - Jan 08 , 2026 | 09:37 PM