16 నుంచి టెట్ పరీక్షలు
ABN , Publish Date - Jun 09 , 2026 | 05:16 AM
ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టెట్) ఈనెల 16నుంచి 22వరకు నిర్వహించనున్నారు. 5రోజుల్లో 10 సెషన్లలో పరీక్షలు ఉంటాయని టీజీటెట్ కన్వీనర్...
ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టెట్) ఈనెల 16నుంచి 22వరకు నిర్వహించనున్నారు. 5రోజుల్లో 10 సెషన్లలో పరీక్షలు ఉంటాయని టీజీటెట్ కన్వీనర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి.రమేష్ తెలిపారు. 16 జిల్లాల్లో 61 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. దరఖాస్తుదారులు ఈనెల 9 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.