సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఖైదీ ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Apr 24 , 2026 | 03:55 AM
సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండం శంశోద్దీన్పూర్కు చెందిన..
కంది, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండం శంశోద్దీన్పూర్కు చెందిన వినోద్ (24)పై సంగారెడ్డి, జహీరాబాద్ పోలీస్ స్టేషన్లలో పలు దొంగతనం కేసులున్నాయి. అతనికి సంగారెడ్డి కోర్టు 6 నెలల శిక్ష విధించగా 4నెలల క్రితం సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, వినోద్ బుధవారం జైలులోని ఆర్వో వాటర్ ప్లాంట్లో వినియోగించే కెమికల్ను తాగానని అధికారులకు చెప్పడంతో వారు టాటాసుమోలో సంగారెడ్డి ప్రభుత్పాస్పత్రికి అనంతరంహైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.