సిఫ్ చేసేస్తున్నారు..
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:07 AM
స్పెషలైజ్డ్ ఇన్వె్స్టమెంట్ ఫండ్స్ (ఎస్ఐఎ్ఫ-సి్ఫ)కు పెట్టుబడిదారుల నుంచి ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. సిఫ్ల నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) జూన్లో...
జూన్లో రూ.17,858 కోట్లకు పెరిగిన సిఫ్ ఏయూఎం
హైబ్రిడ్ పెట్టుబడి వ్యూహాలదే హవా..
న్యూఢిల్లీ: స్పెషలైజ్డ్ ఇన్వె్స్టమెంట్ ఫండ్స్ (ఎస్ఐఎ్ఫ-సి్ఫ)కు పెట్టుబడిదారుల నుంచి ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. సిఫ్ల నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) జూన్లో నెలవారీ ప్రాతిపదికన 29 శాతం పెరిగి రూ.17,858 కోట్లకు పెరిగినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా వెల్లడించింది. మేలో మొత్తం సిఫ్ ఏయూఎం రూ.13,814 కోట్లుగా ఉంది. సాధారణ మ్యూచువల్ ఫండ్స్, అధిక పెట్టుబడి అవసరమ య్యే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) మధ్య ఉన్న అగాధాన్ని భర్తీ చేసేందుకు గత ఏడాది ఫిబ్రవరిలో సిఫ్ల విధానాన్ని సెబీ తెచ్చింది. సిఫ్ విభాగంలో హైబ్రిడ్ పెట్టుబడి వ్యూహాల హవా కొనసాగుతోంది. జూన్ చివరినాటికి మొత్తం సిఫ్ ఏయూఎంలో ఈ పెట్టుబడి వ్యూహాల వాటా 72 శాతం (రూ.12,822 కోట్లు)గా ఉంది.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్