బహిరంగ మార్కెట్ ద్వారా షేర్ల బైబ్యాక్
ABN , Publish Date - Jul 08 , 2026 | 05:50 AM
లిస్టెడ్ కార్పొరేట్ కంపెనీలు బహిరంగ మార్కెట్ (స్టాక్ ఎక్స్ఛేంజీలు) ద్వారా సొంత షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేసే అవకాశాన్ని సెబీ పునఃప్రవేశపెట్టింది. ఆగస్టు 1 నుంచి ఇది...
ఆగస్టు 1 నుంచి అమల్లోకి..
న్యూఢిల్లీ: లిస్టెడ్ కార్పొరేట్ కంపెనీలు బహిరంగ మార్కెట్ (స్టాక్ ఎక్స్ఛేంజీలు) ద్వారా సొంత షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేసే అవకాశాన్ని సెబీ పునఃప్రవేశపెట్టింది. ఆగస్టు 1 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. బైబ్యాక్ గడువును మాత్రం 66 పని దినాలకు కుదించింది. షేర్ల బైబ్యాక్కు సంబంధించి జూలై 1వ తేదీతో సెబీ విడుదల చేసిన కొత్త నియమావళిలోని ముఖ్య విషయాలు..
ఇకపై కంపెనీలు ప్రత్యేక విండో అవసరం ఏర్పాటు చేయాల్సిన లేకుండా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో రెగ్యులర్ ట్రేడింగ్ మెకానిజం ద్వారానే సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేయవచ్చు. ఇది కంపెనీలకు మరింత వెసులుబాటు కల్పించడంతో పాటు బైబ్యాక్ సమర్థతను పెంచేందుకు తోడ్పడనుంది.
కొందరు ఇన్వెస్టర్లకు మాత్రమే ప్రయోజనం కలుగుతున్నదన్న ఆరోపణలతో పాటు పన్ను సంబంధిత సమస్యల కారణంగా 2025లో సెబీ ఈ షేర్ల బైబ్యాక్ ప్రక్రియను రద్దు చేసింది.
ఈ ప్రక్రియను పునఃప్రవేశపెట్టడంతో కార్పొరేట్ కంపెనీలు తమ వద్దనున్న అదనపు నగదు నిల్వలను షేర్హోల్డర్లకు తిరిగి పంచడంతో పాటు మార్కెట్లు బలహీనంగా ఉన్న సమయంలో షేరు ధరకు మద్దతునిచ్చేందుకు వెసులుబాటు లభించనుంది.
ప్రకటన చేసిన 4 పనిదినాల్లో స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా బైబ్యాక్ ను ప్రారంభించాల్సి ఉంటుంది. ఆఫర్ ప్రారంభమై నాటి నుంచి 66 పనిదినాల్లో ఈ ప్రక్రియ ముగియాల్సి ఉంటుంది. గతంలో ఇందుకు 6 నెలల సమయం ఉండేది.
ఇవి కూడా చదవండి..
శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
రాణిస్తున్న బ్యాంకింగ్ షేర్లు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు