రూ.43,000 కోట్ల ఎఫ్పీఐ పెట్టుబడులు వెనక్కి
ABN , Publish Date - Jun 08 , 2026 | 01:18 AM
అంతర్జాతీయ మార్కెట్లలో టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత రంగాల్లో పెట్టుబడి అవకాశాలకు డిమాండ్...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత రంగాల్లో పెట్టుబడి అవకాశాలకు డిమాండ్ పెరగడం, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ).. జూన్ తొలి వారంలోనే భారత ఈక్విటీల నుంచి రూ.42,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎఫ్పీఐలు ఉపసంహరించుకున్న మొత్తం రూ.2.67 లక్షల కోట్లకు చేరుకుంది.
ఈ వార్తలనూ చదవండి:
ఐటీ రిటర్నుల ఫైలింగ్కు వేళాయే..