సైన్యానికి 41 జేకే 250ఈ డ్రోన్లు
ABN , Publish Date - Jun 16 , 2026 | 01:52 AM
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్.. భారత సైన్యానికి అత్యాధునికమైన...
డ్రోగో ఏరోస్పేస్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్.. భారత సైన్యానికి అత్యాధునికమైన 41 జేకే 250ఈ డ్రోన్లను అందజేసింది. ఒకసారి చార్జింగ్ చేస్తే ఏకబిగిన మూడు గంటల పాటు గాల్లో ఎగురుతూ వివిధ సైనిక కార్యక్రమాలు పూర్తి చేయడం ఈ డ్రోన్ల ప్రత్యేకత. రూ.72 కోట్ల విలువైన కాంట్రాక్టు కింద ఈ ఏడాది ఆగస్టు నాటికి మిగతా డ్రోన్లను కూడా సైన్యానికి అందజేయనుంది.