Share News

MSME Exports: ఎంఎస్ఎంఈ ఎగుమతులకు చేయూత

ABN , Publish Date - Jan 03 , 2026 | 02:31 AM

ట్రంప్‌ టారి్‌ఫల యుద్ధంతో అల్లాడుతున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు (ఎంఎ్‌సఎంఈ) కేంద్ర ప్రభుత్వం మరో శుభ వార్త చెప్పింది....

MSME Exports: ఎంఎస్ఎంఈ ఎగుమతులకు  చేయూత

  • రూ.7,295 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ

  • వడ్డీ సబ్సిడీ కోసం రూ.5,181 కోట్లు

  • రుణాల హామీ కోసం రూ.2,114 కోట్లు

న్యూఢిల్లీ: ట్రంప్‌ టారి్‌ఫల యుద్ధంతో అల్లాడుతున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు (ఎంఎ్‌సఎంఈ) కేంద్ర ప్రభుత్వం మరో శుభ వార్త చెప్పింది. ఈ కంపెనీలను ఆదుకునేందుకు రూ.7,295 కోట్లతో ప్రత్యేక ప్యాకేజి ప్రకటించింది. ఇందులో రూ.5,181 కోట్లు ఈ కంపెనీలు తీసుకునే రుణాలపై వడ్డీ సబ్సిడీ కింద అందజేస్తారు. మరో రూ.2,114 కోట్లు ఈ కంపెనీలు తీసుకునే రుణాలకు హామీగా ఇస్తారు. వచ్చే ఆరేళ్లలో (2025-31) ఈ ప్యాకేజి అమలు చేస్తామని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అజయ్‌ భాదూ చెప్పారు. ప్రస్తుత ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల్లో మన ఎంఎ్‌సఎంఈల ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక ప్యాకేజి దోహదం చేస్తుందని తెలిపారు.

ముఖ్యాంశాలు ..

  • అర్హత ఉన్న ఎంఎ్‌సఎంఈల ఎగుమతులకు మాత్రమే రుణ, వడ్డీ సబ్సిడీ.

  • ఎగుమతి రుణాలపై 2.75 శాతం వడ్డీ సబ్సిడీ.

  • ఒక్కో ఎంఎ్‌సఎంఈకి ఏటా రూ.50 లక్షలకు మించకుండా వడ్డీ సబ్సిడీ.

  • ఎగుమతి రంగంలోని ఒక్కో ఎంఎ్‌సఎంఈ తీసుకునే వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలకు కోసం రూ.10 కోట్లకు మించకుండా హామీ.

  • సూక్ష్మ, చిన్న కంపెనీల వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణ చెల్లింపుల్లో 85 శాతం వరకు, మధ్య తరహా కంపెనీల వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాల్లో 65 శాతం వరకు చెల్లింపులకు హామీ.

  • జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను బట్టి ఏటా మార్చి,సెప్టెంబరు నెలల్లో వడ్డీ రాయితీపై సమీక్ష.

  • ఆర్‌బీఐ, డీజీఎ్‌ఫటీ సంయుక్తంగా ఈ ప్యాకేజిని అమలు చేస్తాయి.

  • ఎంపిక చేసిన ఉత్పత్తుల రంగంలో ఉన్న ఎంఎ్‌సఎంఈలకుమాత్రమే వడ్డీ సబ్సిడీ, రుణ చెల్లింపుల హామీ.

  • నియంత్రిత వస్తువులు, వేస్ట్‌, స్ర్కాప్‌, పీఎల్‌ఐ పథకంలోని ఎంఎ్‌సఎంఈలకు ఈ రాయితీలు వర్తించవు.

రెండో దశలో..

ఎంఎ్‌సఎంఈల ఎగుమతుల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబరులోనే రూ.25,060 కోట్లతో ఎగుమతుల ప్రోత్సాహక మిషన్‌ (ఈపీఎం) పేరుతో ప్రత్యేక పథకం ప్రకటించింది. ఈ పథకం రెండో దశలో భాగంగా ప్రభుత్వం తాజాగా ఈ ప్రత్యేక ప్యాకేజి అమలు చేయనుంది. ఈపీఎం పథకం తొలి దశలో ఎంఎ్‌సఎంఈల ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం గత ఏడాది డిసెంబరు 31న రూ.4,531 కోట్లు విడుదల చేసింది. ఎగుమతుల రంగంలో ఉన్న ఎంఎ్‌సఎంఈలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు ఈ ప్యాకేజిని ఉద్దేశించినట్టు అజయ్‌ తెలిపారు.

Updated Date - Jan 03 , 2026 | 02:31 AM