హైదరాబాద్-తిరుపతి మధ్య డెయిలీ విమాన సర్వీసులు
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:53 AM
హైదరాబాద్, తిరుపతి మధ్య రోజూ డైరెక్ట్ విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్టు...
ఎయిరిండియా ఎక్స్ప్రెస్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్, తిరుపతి మధ్య రోజూ డైరెక్ట్ విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్టు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ గురువారం ప్రకటించింది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఈ విమానాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి 2.40 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మధ్యాహ్నం 3.25 గంటలకు విమానం తిరుపతి నుంచి బయలుదేరి 4.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..
చెత్తకుప్పలో కాలిన మృతదేహం.. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు