అన్నదాతా సుఖీభవతో అన్యాయం: షర్మిల
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:11 AM
అన్నదాతా సుఖీభవ పథకంపై సీఎం చంద్రబాబు మాట మార్చారని, ఆ పథకాన్ని అన్నదాతా దుఖీఃభవగా మార్చారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
కాకినాడ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): అన్నదాతా సుఖీభవ పథకంపై సీఎం చంద్రబాబు మాట మార్చారని, ఆ పథకాన్ని అన్నదాతా దుఖీఃభవగా మార్చారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా శుక్రవారం ఆమె కాకినాడ జిల్లా జగ్గంపేటలో పర్యటించారు. కాట్రావులపల్లిలో రచ్చబండ కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి రైతుకు రాష్ట్రం తరఫున రూ.20వేలు ఇవ్వాల్సిందేనన్నారు.