Share News

మహిళా బిల్లుపై సంబరాలకు రెడీ

ABN , Publish Date - Apr 17 , 2026 | 06:56 AM

మహిళా బిల్లు నేడు లోక్‌సభలో ఆమోదం పొందనున్న నేపథ్యంలో సంబరాలు నిర్వహించేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు.

మహిళా బిల్లుపై సంబరాలకు రెడీ

  • నేడు కూటమి సమావేశం హాజరుకానున్న సీఎం, పవన్‌, మాధవ్‌

అమరావతి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): మహిళా బిల్లు నేడు లోక్‌సభలో ఆమోదం పొందనున్న నేపథ్యంలో సంబరాలు నిర్వహించేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో కూటమి నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ హాజరవుతారు. సమావేశానికి హాజరు కావాలని కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే సమాచారం పంపారు. చంద్రబాబు ఉదయం 11 గంటలకే టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు.

Updated Date - Apr 17 , 2026 | 06:58 AM