పీఆర్సీ చైర్మన్ను నియమించాలి: విద్యాసాగర్
ABN , Publish Date - Mar 30 , 2026 | 06:37 AM
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వేతన సవరణ కమిటీ...
అమరావతి, విజయవాడ, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వేతన సవరణ కమిటీ(సీఆర్సీ) చైర్మన్ నియామకాన్ని వెంటనే చేపట్టాలని ఏపీఎన్జీజీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీజేఏసీ చైర్మన్ విద్యాసాగర్ డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఏడాదిగా విరమణ బెనిఫిట్స్ రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలని కోరారు.